MS ధోని బైక్ మ్యూజియం చూసారా…..?

టీంఇండియా క్రికెట్‌ మాజీ సారధి MS ధోని ఖాళీ సమయాల్లో ఏమి చేస్తాడని ఏ అభిమానిని అడిగిన సరే వెంటనే వాళ్ళకి గుర్తొచ్చేది బైక్‌ రైడింగ్.ఎందుకంటే MS ధోనికి బైక్‌లంటే అంత పిచ్చి మరి.ఈ విషయం అందరికీ తెలిసింనదే. ఇటివలే ధోని భార్య సాక్షి కూడా ఇదే విషయాన్ని అభిమానులతో పంచుకుంది.

“ధోనీ ఎక్కువగా ప్రేమించే టాయ్స్‌” అంటూ..సాక్షి సింగ్ ఒక ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకుంది.ఈ ఫొటో ఏంటో తెలుసా… బైక్స్‌ మ్యూజియం.కానీ సాక్షి సింగ్ మాత్రం ఆ ఫొటో ఎక్కడిది అన్న విషయం చెప్పలేదు.

సోషల్ మీడియా లో ఆ ఫోటో చూసిన అభిమానులు మాత్రం ఇది “ధోని బైక్‌ మ్యూజియం”  రాంచీ లో తన ఇంటి ప్రాంగణంలోనే ధోని ఏర్పాటు చేసుకున్నాడని అదే ఈ ఫోటోలో ఉన్న  బైక్‌ మ్యూజియం  అంటూ….నెటిజన్లు మరియు అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.ఏది ఏమైనా గాని MS ధోని వద్ద చాలా బైకులు ఉన్న సంగతి మనకూ తెలిసిందే…

No comments