కరుణానిధి కన్నా సీఎం పళనిస్వామి గొప్పవాడా ?

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల మరణించిన డీఎంకే ప్రెసిడెంట్ కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ అంత్యక్రియలకు సీఎం పళనిస్వామి హాజరుకాలేదు. సోమవారం జరిగిన నివాళి కార్యక్రమంలో రజనీకాంత్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. కరుణ సంస్మరణ సభలో స్టాలిన్‌తో కలిసి పాల్గొన్న రజనీకాంత్ కొవ్వొత్తులు వెలిగించి దివంగత నేతకు నివాళులర్పించారు.


అనంతరం రజనీ మాట్లాడుతూ.. కరుణ అంత్యక్రియలకు ఎందుకు రాలేదని పళనిస్వామిని ప్రశ్నించారు. గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా దేశం మొత్తం హాజరైందన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారన్నారు. కానీ, తమిళనాడు ముఖ్యమంత్రి మాత్రం కనిపించలేదన్నారు. కరుణానిధి, జయలలిత కన్నా పళనిస్వామి గొప్పవాడా అని రజనీకాంత్ ప్రశ్నించారు. కరుణ లేని తమిళనాడును ఊహించలేకపోతున్నాని ఆయన అన్నారు. ఎన్నో విజయాలను, అపజయాలను, మోసాలను కరుణ ఎదుర్కొన్నారని, దేశవిదేశాల నుంచి నేతలు తమిళనాడుకు వస్తే, వాళ్లు కచ్చితంగా కరుణను కలిసేవారని, ఇప్పుడు వాళ్లు ఎవర్ని కలుస్తారో అర్థం కావడం లేదని రజనీ అన్నారు.

No comments