బ్యాంకాక్‌లో కృష్ణా జిల్లా యువకుడి మృతి

బ్యాంకాక్‌లో ప్రమాదవశాత్తూ ఈతకొలనులో పడి కృష్ణా జిల్లా యువకుడు మృతిచెందాడు. మచిలీపట్నానికి చెందిన వెంకటేశ్‌ హైదరాబాద్‌లో నివసిస్తూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో పనిచేస్తున్నారు. ఆఫీస్‌ పనిమీద స్నేహితులతో కలిసి ఇటీవల బ్యాంకాక్‌కు వెళ్లారు. అక్కడ ఊహించని విధంగా ప్రమాదానికి గురయ్యారు. వెంకటేశ్‌ మరణవార్త విని అతడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమతో అప్పటివరకు కలిసి ఉన్న వ్యక్తి అందని లోకాలకు వెళ్లిపోయాడంటూ స్నేహితులు ఆవేదన చెందుతున్నారు. వెంకటేశ్‌ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు అధికారులను సంప్రదిస్తున్నారు.

వెంకటేష్ మృతిపై కుటుంబ సభ్యులు అధికారులకు సమాచారం ఇచ్చారు. అతడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా సొంత ఊరికి తరలించేందుకు సహకరించాలని విజ్ఞ‌ప్తి చేశారు. అధికారులు కూడా ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. బ్యాంకాక్‌లో ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.

No comments